ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓనం పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేరళ ప్రజలకు, మలయాళీ కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “ఈ పండుగ ప్రకృతి మాత యొక్క కీలక పాత్రను మరియు మన కష్టపడి పనిచేసే రైతుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ఓనం మన సమాజంలో సామరస్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలి” అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ఓనం పండుగ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
“ఓనం పండుగ సందర్భంగా, భారతదేశం మరియు విదేశాలలో నివసిస్తున్న తోటి పౌరులందరికీ, ముఖ్యంగా కేరళ సోదరులు మరియు సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పంటల కోతకు గుర్తుగా జరుపుకునే ఓనం మన రైతుల శ్రమను గౌరవించటానికి మరియు ప్రకృతి మాత పట్ల మన కృతజ్ఞతను తెలియజేయడానికి ఒక సందర్భం. కేరళ ప్రజలు తమ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్నారు. పరస్పర సహకారం మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ పండుగ వారికి కూడా ఒక అవకాశం. ఈ సందర్భంగా, ఐక్యంగా పనిచేసి భారతదేశాన్ని సంపన్నమైన మరియు ఉజ్వలమైన దేశంగా మార్చడంలో సహకరించాలని సంకల్పిద్దాం” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ట్వీట్ చేస్తూ,”“ఓనం పండుగ సందర్భంగా మన దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాబలి రాజు జ్ఞాపకార్థం జరుపుకునే ఓనం నిజాయితీ, కరుణ మరియు త్యాగం యొక్క ఉన్నత విలువలకు ప్రతీక. పొలాల్లో కొత్త పంటల రూపంలో ప్రకృతి తల్లి అనుగ్రహాన్ని జరుపుకోవడానికి ఇది ఒక సందర్భం. ఓనం స్ఫూర్తి ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, శ్రేయస్సు మరియు సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY