భారత్, శ్రీలంక జట్ల మధ్య లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించింది. అయితే జట్టులో మార్పులపై బీసీసీఐ బుధవారం నాడు మరో ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ లు దూరమయ్యారని తెలిపారు. వెస్టిండీస్తో గత ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ జరిగిన మూడో టీ20 సందర్భంగా ఫీల్డింగ్ చేసే ప్రయత్నంలో సూర్యకుమార్ హెయిర్లైన్ ఫ్రాక్చర్ కు గురయ్యాడని, అలాగే బౌలింగ్ లో దీపక్ చాహర్ కు కుడి క్వాడ్రిసెప్స్ గాయం తగిలిందని పేర్కొన్నారు. గాయాలతో వీరిద్దరూ టీ20 సిరీస్ కు దూరమయ్యారని, గాయాల నిర్వహణ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళతారని బీసీసీఐ వెల్లడించింది.
భారత్ టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ