సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్‌ గా కేఎల్ రాహుల్‌

BCCI Announces India Squads for T20I Series Against South Africa And 5th Test Against England, India Squads for T20I Series Against South Africa And 5th Test Against England, Paytm T20I home series against South Africa, India squad for T20I series against South Africa, home series against South Africa,, Paytm T20I home series, India Squads for T20I Series Against South Africa, India Squads for 5th Test Against England, 5th Test Against England, BCCI has announced the Indian cricket team squads for the five-match T20I series against South Africa, BCCI announce Indian squads, T20I Series News, T20I Series Latest News, T20I Series Latest Updates, T20I Series Live Updates, South Africa, England, Mango News, Mango News Telugu,

సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల​ మధ్య జూన్ 9, 12, 14, 17, 19వ తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో తలపడే 18 మందితో కూడిన భారత్ ఆటగాళ్ల జాబితాను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఆదివారం నాడు ప్రకటించింది. ఈ టీ20 సిరీస్‌ కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటుగా సీనియర్ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చారు. అలాగే గాయాలతో బాధపడుతున్న రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్ లను ఎంపిక చేయలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా, రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు.

అలాగే టీ20 సిరీస్ కు ఎంపికైన 18 మందిలో ఐపీఎల్ లో సత్తాచాటిన బౌలర్స్ ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌ చోటుదక్కించుకున్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, సీనియర్ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ కూడా మళ్ళీ జట్టులోకి వచ్చారు. మరోవైపు జూలై 1 నుంచి 5 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ కోసం కూడా సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన భారత్ టెస్టు జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు జట్టులో సీనియర్‌ ఆటగాడు చటేశ్వర్ పుజారా మళ్ళీ చోటు దక్కించుకున్నాడు.

సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం భారత్ టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)(వికెట్కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్,అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్.

ఇంగ్లాండ్ తో 5వ టెస్టు కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + sixteen =