భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో బాధపడడంతో ఆయన కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్టు తెలుస్తుంది. వైద్య పరీక్షలు నిర్వహణ అనంతరం ఈరోజు సాయంత్రం సౌరవ్ గంగూలీకి సర్జరీ చేయనున్నట్టు సమాచారం. అయితే సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై కుటుంబసభ్యులు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ