భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దీరోజుల క్రితం ఛాతీనొప్పితో బాధపడుతూ కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గుండెలోని రక్తనాళాలు రెండు చోట్ల మూసుకుపోవడంతో వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. 6 రోజుల పాటు చికిత్స అనంతరం వైద్యపరంగా గంగూలీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గంగూలీ గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే గంగూలీకి చికిత్స అందించిన వైద్యులు బృందం, డిశ్చార్జి తరవాత కూడా ఆయనను పర్యవేక్షిస్తారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఆయన ఇంటి వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు డిశ్చార్జ్ అవుతున్న సమయంలో ఆసుపత్రి వద్ద గంగూలీ మీడియాతో మాట్లాడారు. “నాకు చికిత్స చేసిన ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలోని వైద్యులకు కృతజ్ఞతలు. నేను పూర్తిగా బాగున్నాను. త్వరలోనే విమాన ప్రయాణానికి సిద్ధంగా ఉంటాను” అని పేర్కొన్నారు. అలాగే త్వరగా కోలుకోవాలని తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి గంగూలీ కృతజ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ