కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ పై భారత్ బయోటెక్ సంస్థ గురువారం నాడు కీలక ప్రకటన చేసింది. పేజ్-3 క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 25,800 మంది వాలంటీర్ల నమోదును విజయవంతంగా పూర్తి చేసుకునట్టు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. మరోవైపు కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే షరతులతో కూడిన ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే కొవాగ్జిన్ ఉత్పత్తి, అమ్మకం లేదా పంపిణీ కోసం కూడా డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతిని మంజూరు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ