భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా పాజిటివ్ కేసులు, 195 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మే 5, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 46,433 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,568 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 12,726 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 32,138 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరింది. ఒక్కరోజులోనే ఆ రాష్ట్రంలో 98 మంది కరోనా వైరస్ తో మరణించారు. అక్కడ మృతుల సంఖ్య ఇప్పటికే 133 కి చేరగా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కి చేరింది. మరోవైపు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే 14,541 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2465 మంది కోలుకోగా, 583 మంది మరణించారు. దేశంలో అత్యధిక కరోనా మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 5,804, ఢిల్లీలో 4,898 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 14,541
- గుజరాత్ – 5,804
- ఢిల్లీ – 4,898
- తమిళనాడు – 3,550
- రాజస్థాన్ – 3,099
- మధ్యప్రదేశ్ – 2,942
- ఉత్తర ప్రదేశ్ – 2,766
- ఆంధ్రప్రదేశ్ – 1,717
- పశ్చిమబెంగాల్ -1259
- పంజాబ్ – 1,232
- తెలంగాణ – 1,085
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu