అన్ని రాష్ట్రాల సీఎంలతో జూలై 27 న పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక చర్చ?

national news, PM Modi, PM Modi Likely to Meet CMs on July 27, PM Modi Video Conference, PM Modi Video Conference News, PM Modi Video Conference On july 27, PM Modi Video Conference with CMs, PM Modi Video Conference with State Chief Ministers

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూలై 25, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,36,861 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా తాజా పరిస్థితులు, బాధితులకు వైద్యం అందుతున్న తీరు, అన్ లాక్ 3.0 తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి రాష్ట్రాల/కేంద్రపాలిత సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. జూన్ 27 వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం జరగనుంది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక సీఎంలతో ప్రధాని మోదీ ఏడోసారి భేటీ కానున్నారు. చివరిగా జూన్‌ 16, 17 తేదీల్లో సీఎంలతో పీఎం మోదీ సమావేశమై పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్ గడువు జూలై‌ 31 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ లాక్ 3.0 లో భాగంగా చేపట్టవలసిన చర్యలపై కీలకంగా చర్చించే అవకాశముంది. ప్రస్తుత కరోనా పరిస్థితులపై సీఎంలతో చర్చించి ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమునట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + sixteen =