భారత్ లో 200 కోట్లు దాటిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన బిల్ గేట్స్

Bill Gates Congratulates PM Narendra Modi for India Crossing 200 Crore Covid-19 Vaccinations, India Crossing 200 Crore Covid-19 Vaccinations, Bill Gates Congratulates PM Narendra Modi, PM Narendra Modi, Bill Gates, Covid Vaccination in India, Wuhan Virus Vaccination Drive, Wuhan Virus Vaccination, Wuhan Virus, India COVID-19 Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో విజయవంతంగా జరుగుతున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటిన విషయం తెలిసిందే. జూలై 17, ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని అధిగమించినట్టుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారతదేశం ఈ ఘనత సాధించడం పట్ల బిలియనీర్, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బిల్ గేట్స్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.

“200 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించడం ద్వారా మరో మైలురాయిని సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు మరియు భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నాం” అని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

ముందుగా 200 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ప్రశంసించారు. ఈ మేరకు జూలై 17న ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “భారత్ మళ్లీ చరిత్ర సృష్టిచింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల ప్రత్యేక సంఖ్యను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను స్కేల్ మరియు వేగంలో అసమానంగా మార్చడానికి సహకరించిన వారి పట్ల గర్వంగా ఉంది. ఇది కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది. వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సమయంలో దేశ ప్రజలు సైన్స్‌పై విశేషమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులు సురక్షితమైన ప్రపంచాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు. వారి స్పిరిట్ మరియు సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 17 =