దేశంలో తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం నాడు ఈ రాష్ట్రాలకు పోల్ ఇన్ఛార్జిలను, సహ ఇన్ఛార్జిలను నియమించింది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ కీలక నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని తమిళనాడుకు ఇన్చార్జిగా నియమించగా, కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ను సహా ఇన్ఛార్జిగా నియమించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కేరళకు ఇన్చార్జిగా నియమించగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా ఇన్ఛార్జిగా నియమించారు. ఇక అస్సాంకు ఇన్ఛార్జిగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహా ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి డాక్టర్.జితేంద్ర సింగ్ ను సహా ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను పుదుచ్చేరికి ఇన్చార్జిగా, పార్టీ ప్రతినిధి, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ను సహా ఇన్ఛార్జిగా నియమించారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने असम, तमिलनाड़ु, केरल और पुदुचेरी के आगामी विधान सभा चुनाव 2021 हेतु चुनाव प्रभारी एवं सह-प्रभारियों की नियुक्ति की है। pic.twitter.com/tmVsqmSPGh
— BJP (@BJP4India) February 2, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ