నాలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు, ఇన్‌ఛార్జిలను నియమించిన బీజేపీ

2021 Assembly Elecctions, Assembly Elecctions 2021, Assembly Elecctions News, Assembly Polls, bjp, BJP Appoints Poll in-charge, BJP Appoints Poll in-charge ahead of Assembly Polls, BJP Appoints Poll in-charge and Co-incharge for 4 States, BJP appoints poll in-charge for Assembly Elecctions, BJP appoints poll in-charge for Kerala, BJP appoints poll in-charge for TN, Mango News, Poll in-charge ahead of Assembly Polls

దేశంలో తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం నాడు ఈ రాష్ట్రాలకు పోల్ ఇన్‌ఛార్జిలను, సహ ఇన్‌ఛార్జిలను నియమించింది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ కీలక నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని తమిళనాడుకు ఇన్‌చార్జిగా నియమించగా, కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్‌ను సహా ఇన్‌ఛార్జిగా నియమించారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కేరళకు ఇన్‌చార్జిగా నియమించగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సిఎన్ అశ్వత్‌ నారాయణ్ సహా ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇక అస్సాంకు ఇన్‌ఛార్జిగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహా ఇన్‌ఛార్జిగా కేంద్ర మంత్రి డాక్టర్.జితేంద్ర సింగ్ ను సహా ఇన్‌ఛార్జిగా నియమించారు. అలాగే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను పుదుచ్చేరికి ఇన్‌చార్జిగా, పార్టీ ప్రతినిధి, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌ ను సహా ఇన్‌ఛార్జిగా నియమించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =