దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,039 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,77,284 కు చేరుకుంది. కరోనాతో మరో 110 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,54,596 కి పెరిగింది. కాగా గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎటువంటి మరణాలు నివేదించలేదు. దేశంలో ఇప్పటికే కోటి 4 లక్షల 62 వేల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా రికవరీ రేటు 97.08 శాతం, మరణాల రేటు 1.43 శాతం:
కొత్తగా 14,225 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,04,62,631 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.08 శాతం గానూ, మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 1,60,057 (1.49%) మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గడ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 11,039 కేసులలో 83.01% శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ