ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 74,435 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,434 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా గుంటూరులో 2028, చిత్తూరులో 1982, శ్రీకాకుళంలో 1322, నెల్లూరులో 1237, విశాఖపట్నంలో 1067 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,54,874 కు చేరుకుంది.
ఇక కరోనా వలన విజయనగరంలో ఎనిమిదిమంది, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కర్నూలులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7800 కి పెరిగింది. గత 24 గంటల్లో 7055 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 9,47,627 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ