జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈకారణంగా.. ఈ రెండు రోజులు పార్లమెంట్ లో జీరో అవర్ మరియు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడం లేదని కేంద్రం తెలియజేసింది. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బులెటిన్ జరీ చేసింది. ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జీరో అవర్లో లేవనెత్త వచ్చని వెల్లడించింది.
కాగా, 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో.. ప్రింటెడ్ బడ్జెట్ బదులు డిజిటల్ బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ సిబ్బందిలో చాలామంది కరోనా బారిన పడిన నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు రెండు సెషన్లుగా జరుపనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మొదటి దశ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండవ దశలో సమావేశాలు జరుపుతారు. దీంతోపాటు లోక్ సభ మరియు రాజ్యసభలను షిఫ్ట్స్ వారీగా నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ