దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 30, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,10,92,522 కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా నమోదైంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 893 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,94,091కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 18 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 94.21 శాతం:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు (18,84,937 – 4.59%) దాటింది. ఇక కొత్తగా 3,52,784 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,87,13,494 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.21 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. అలాగే జనవరి 29, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 72,73,90,698 కు చేరుకుంది. జనవరి 29న 16,15,993 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ