దేశవ్యాప్తంగా గురువారం ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని మునుగోడుతో పాటుగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదమ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రాంనాథ్, ఒడిశాలోని ధామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడం, అనర్హత వేటు, సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాల కారణంగా ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అన్ని చోట్లా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ మరియు బిజూ జనతాదళ్ పార్టీల మధ్య పోటీ నెలకుంది. కాగా ఈ ఆరు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల కౌంటింగ్ పక్రియను నవంబర్ 6న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్ లో ఆర్జేడీ, బీజేపీ మధ్యనే పోటీ నెలకుంది. హర్యానాలోని ఆదమ్ పూర్ లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మధ్య పోటీ ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రాంనాథ్ లో ఎస్పీ, బీజేపీ మధ్య, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, ఇండిపెండెంట్స్ మధ్య, ఒడిశాలోని ధామ్నగర్ లో బీజేపీ, బీజేడీ మధ్య పోటీ నెలకుంది. ఇక తెలంగాణలోని మునుగోడులో అధికార టీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ల మధ్య కీలక త్రిముఖ పోటీ నెలకున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE