ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. ఈ పథకం కింద, అవసరమైన వారికి ఉచిత ఆహార ధాన్యం అందించబడుతుంది. పేద మరియు బలహీన వర్గాల పట్ల ఆందోళన మరియు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకం మార్చి నెలతో ముగియనుండగా కేంద్రం తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది.
“భారతదేశం యొక్క బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేయడానికి, సెప్టెంబర్ 2022 వరకు మరో ఆరు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని మునుపటిలా ఉపయోగించుకోగలుగుతారు” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ పథకం కింద, తెల్ల రేషన్ కార్డు, అంతోద్యయ అన్న యోజన కార్డు, ఆహార పథకం కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రతి నెలా 5 కిలోల ఆహార ధాన్యాలు (గోధుమలు, బియ్యం, ధాన్యం) ఉచితంగా అందజేస్తారు. దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. కోవిడ్-19 మొదటి వేవ్ సమయంలో కేంద్రం 2020 ఏప్రిల్లో ఈ పథకాన్ని ప్రారంభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ