గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో విషపూరిత వాయువు లీక్ అవటంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్ మిల్లో కార్మికులు ఈ పాయిజన్ గ్యాస్ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో జిఐడీసీ ప్రాంతంలోని తమ ఫ్యాక్టరీ సమీపంలో.. నిలిచి ఉన్న రసాయన ట్యాంకర్ లీక్ అవటం వలన విషపూరిత వాయువు వెలువడింది. దీనిని పీల్చడంతో సుమారు 25 మంది స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు ఆసుపత్రిలో మరణించారు, అని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక కార్యాలయం ఇన్ఛార్జ్ చీఫ్ బసంత్ పరీక్ చెప్పారు. ఫ్యాక్టరీ లోపల కార్మికులు నిద్రిస్తుండగా విషవాయువు వెలువడటంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ