చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. రెండేళ్ల క్రితం కరోనా మొదలైనప్పుడు ఉన్న పరిస్థితులు అక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. దేశంలో రెండేళ్లలో అత్యధిక రోజువారీ కరోనావైరస్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. చైనా నిన్న (శుక్రవారం) 9 మిలియన్ల మంది నివసిస్తున్న ఈశాన్య పారిశ్రామిక కేంద్రం చాంగ్చున్లో లాక్డౌన్ విధించింది. జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇళ్లను వదిలి రావటానికి కుదరదు. కానీ, అత్యంత జన సాంద్రత కలిగిన నగరం కావటంతో ప్రజలు కనీస అవసరాలకోసం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇంకా, నగర అధికారులు అన్ని అనవసర వ్యాపారాలను మూసివేశారు మరియు రవాణా సంబంధాలు కూడా నిలిపివేయబడ్డాయి. బీజింగ్లో అనేక రెసిడెన్షియల్ కాంపౌండ్లు పూర్తిగా లేదా పాక్షికంగా లాక్ చేయబడ్డాయి.
జాతీయ అధికారులు డజన్ల కొద్దీ నగరాల్లో 1,000 కంటే ఎక్కువ తాజా COVID-19 కేసులను గుర్తిస్తున్నారు. ఎక్కువ కేసులు నమోదైతే లాక్డౌన్ విధిస్తామని చైనా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జిలిన్ నగరంలో చైనా అధికారులు ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ విధించారు. అక్కడ, ముందుజాగ్రత్త చర్యగా ఇతర నగరాలతో ప్రయాణ లింక్లు నిలిపివేయబడ్డాయి. అలాగే, ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో షాంఘై కేంద్రంగా ఉన్న అన్ని పాఠశాలలను కూడా మూసివేసారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. షాంఘై మరియు ఇతర ప్రధాన నగరాల్లోని అధికారులు ఒమిక్రాన్ను అరికట్టడానికి లాక్డౌన్లు విధించటంతో పాటు కోవిడ్ పరీక్షలను వేగవంతం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ