భారత్ లో కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కొత్తగా 37,148 కరోనా కేసులు, 587 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 21, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,55,191 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కరోనా మరణాల సంఖ్య 28,084 కి చేరుకుంది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 62.72 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 16, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 11,55,191
కొత్తగా నమోదైన కేసులు (జూలై 20 – జూలై 21 (8AM-8AM) : 37,148
నమోదైన మరణాలు : 587
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 7,24,578
యాక్టీవ్ కేసులు : 4,02,529
మొత్తం మరణాల సంఖ్య : 28,084
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu