కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కీలక నేత ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ గా తేలింది. అన్ని ప్రోటోకాల్లను అనుసరించి, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రియాంకా గాంధీ తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. వైద్యులు సూచన మేరకు సోనియా గాంధీ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉండి, అవసరమైన చికిత్స పొందుతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF