కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 8,99,864 కరోనా పరీక్షలను నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 3,09,41,264 కు పెరిగింది. అలాగే పాజిటివ్ రేటు 8.81 శాతంగా ఉంది. “టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్” వ్యూహాన్ని అనుసరించి, ల్యాబ్ ల సంఖ్య పెంచి రోజుకు 10 లక్షల పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు దేశంలో పరీక్షల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 971 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 505 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 1476 అయింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu