భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీలోని పలు విభాగాలకు నేతలను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజాగా మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను నియమించారు. అలాగే జౌన్పూర్కు చెందిన హిమాన్షు తివారీని ఉత్తరప్రదేశ్ యూనిట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇటీవలే మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మానిక్ కదమ్ను నియమించిన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లు వీరే..
- నాసిక్ డివిజన్ – దశరథ సావంత్
- పూణే డివిజన్ – బాలాసాహెబ్ జైరామ్ దేశ్ముఖ్
- ముంబై డివిజన్ – విజయ్ తానాజీ మోహితే
- ఔరంగాబాద్ డివిజన్ – సోమనాథ్ థోరట్
- నాగ్పూర్ డివిజన్ – ద్యానేశ్ వకుద్కర్
- అమరావతి డివిజన్ – నిఖిల్ దేశ్ముఖ్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE