దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 500 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 406 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 21, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,69,421 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 12 మంది (కేరళలో 11 మరణాల సవరణతో కలిపి) మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,586కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు కొంత ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 6,402 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:
దేశంలో ప్రస్తుతం 6,402 (0.01%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 481 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,32,433 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక నవంబర్ 20న 79,969 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.51 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE