ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, ఏపీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద రాజు, జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు పలువురు హాజరయ్యారు. సీఎం జగన్ ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు.. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ భూములు, ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్, రూ. 4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే నరసాపురం పట్టణంలో మంచినీటి ఎద్దడి నివారణకు రూ. 61.81 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ది పథకం, రూ. 1.08 కోట్లతో చేపట్టిన ఖజానా మరియు లెక్కల కార్యాలయం, 220/132/ 33 కె.వి రుస్తుంబాద గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం, రూ.1400 కోట్లతో చేపట్టిన కాజ, ఈస్ట్ కొక్కిలేరు మరియు ముస్కేపాలెం అవుట్ఫాల్ నిర్మాణం, రూ. 237 కోట్లతో చేపట్టిన నరసాపురం అండర్గ్రౌండ్ డ్రైనేజి స్కీము, వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం చేయుట, శేషావతారం పంట కాలువ అభివృద్ది పనులు, మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణ పనులు వంటివాటికి శంకుస్ధాపన చేశారు. అలాగే నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనం, ప్రజారోగ్యసాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం వంటివాటికి సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE