దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 9,195 పాజిటివ్ కేసులు, 302 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,08,886 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,80,592 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 7,347 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,42,51,292 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.40 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.38 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 77,002 (0.22) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (డిసెంబర్ 28 (8am) – డిసెంబర్ 29 (8am)):
- కేరళ – 2,474
- మహారాష్ట్ర – 2,172
- వెస్ట్ బెంగాల్ – 752
- తమిళనాడు – 619
- ఢిల్లీ – 496
- గుజరాత్ – 394
- కర్ణాటక – 356
- తెలంగాణ – 228
- మిజోరాం – 207
- ఒడిశా – 156
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ