తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 4వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని మరియు బస్టాండ్ సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మరియు మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE