దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 100 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 99 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 27, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,82,437 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో మరణం (మహారాష్ట్రలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,739కి పెరిగింది. ఇక జనవరి 26న 94,534 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.10 శాతంగా నమోదైంది.
దేశంలో 1,896 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,896 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 108 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,49,802 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (33), కర్ణాటక (18), మహారాష్ట్ర (12), ఢిల్లీ (8), తమిళనాడు (9) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE