సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ నేతృత్వంలో ప్రారంభమైన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా తొలుత లక్ష్మీపురం శ్రీవరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ లక్ష్మీపురం లోని మసీదులో ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో లోకేష్ పక్కనే ఉన్న తారకరత్న.. మసీదు నుంచి బయటకు వచ్చే క్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున గుమికూడటంతో సొమ్మసిల్లి పడిపోయారు.
దీంతో అప్రమత్తమైన యువగళం వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను వెంటనే కారులో స్థానిక కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కుప్పం పట్టణంలోని పీసీఎస్ వైద్య కళాశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఆస్పత్రికి చేరుకొని తారకరత్నను పరమేసించారు. డక్టర్లను కలిసి అతడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదమేమీ లేదని వైద్యులు వారికి తెలిపారు. అయితే ఇటీవల టీడీపీ కార్యక్రమాలలో వరుసగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో తారకరత్న పడిపోవడం టీడీపీ పార్టీలో కొంత కలవరం కలిగించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE