కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మార్చ్ 31, మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లాక్డౌన్ సమయంలో సరకుల రవాణాకు అంతరాయం కలగకుండా పలు రకాల వాహనాల అనుమతులు, డ్రైవింగ్ లైసెన్స్ ల కాలపరిమితిని జూన్ 30వతేదీ వరకు పెంచుతూ కేంద్ర రవాణ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 1 , 2020 తేదీ నుంచి కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్, ఇతర అనుమతుల పత్రాల చెల్లుబాటు గడువును జూన్ 30వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర రవాణా శాఖ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించించడంతో ప్రభుత్వ రవాణశాఖ కార్యాలయాలను మూసివేసినందున వివిధ పత్రాల చెల్లుబాటు గడువును పెంచడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, పర్మిట్ పత్రాల చెల్లుబాటు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించడంతో దేశంలోని కోటికి పైగా వాహనాల యజమానులు, డ్రైవర్లకు ఉపశమనం లభించనుందని పేర్కొన్నారు.
[subscribe]