దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాగా రోజువారీ కేసుల నమోదులో కొంత హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,39,38,764 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2135, తమిళనాడులో 1846, కేరళలో 1488, కర్ణాటకలో 1425, పశ్చిమబెంగాల్ లో 1232 నమోదయ్యాయి. అలాగే కరోనాతో మరో 57 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,167 కు పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.47 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,45,026 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 20,742 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,32,67,571 కు చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 27, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 87,36,11,254
- జూలై 26న నిర్వహించిన కరోనా పరీక్షలు : 4,25,337
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,39,38,764
- కొత్తగా నమోదైన కేసులు [జూలై 26–జూలై 27 (8AM-8AM)] : 18,313
- నమోదైన మరణాలు : 57
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,32,67,571
- యాక్టీవ్ కేసులు : 1,45,026
- మొత్తం మరణాల సంఖ్య : 5,26,167
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY