భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో 198 కరోనా వైరస్ లను గుర్తించినట్లు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) ప్రకటించింది. చైనా, యూరప్ దేశాల్లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్ కి చెందిన రకమే భారత్ లో కూడా వ్యాప్తి చెందిందని, ఈ క్రమంలో కరోనా వైరస్ ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. మొత్తం 400 జన్యువులపై పరిశోధనలు చేయగా 198 వేర్వేరు కరోనా వైరస్ రకాలను గుర్తించామని, భారత్లో ప్రవేశించే ముందే ఈ వైరస్ ఇన్నిరకాలుగా రూపాంతరం చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలిందన్నారు.
దేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ రకాల్లో అహ్మదాబాద్ లో 60 రకాలు, తెలంగాణ రాష్ట్రంలో 55, ఢిల్లీలో 39, కర్ణాటకలలో 15, మహారాష్ట్రలో 15, గాంధీనగర్లో 13 గుర్తించినట్లు తెలిపారు. కాగా ఇందులో ఏ రకం ఎంత వేగంగా వ్యాపించాయి, రూపాంతరం విధానం, తదితర అంశాలకు కారణాలు కనిపెట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu