దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1134 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 22, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,98,118 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 5 మరణాలు (ఛత్తీస్ ఘడ్లో 1, మహారాష్ట్రలో 1, ఢిల్లీలో 1, గుజరాత్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి పెరిగింది. కాగా మార్చి 21న 1,03,831 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా నమోదైంది.
దేశంలో 7,026 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.79 శాతం:
దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య 7,026 (0.02%)కి చేరింది. ఇక కొత్తగా 662 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,60,279 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE