తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి, తెలుగువారందరికీ పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు

Janasena Chief Pawan Kalyan Extends Greetings to Telugu People On the Occasion of Ugadi Festival,Janasena Chief Pawan Kalyan Extends Greetings,Pawan Kalyan Extends Greetings to Telugu People,Pawan Kalyan Greetings On the Occasion of Ugadi Festival,Mango News,Mango News Telugu,On Ugadi Tollywood Stars Give A Peek,Janasena Chief Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan Latest News,Pawan Kalyan Ugadi Greetings News,Janasena Ugadi News and Live Updates,Janasena Chief Pawan Kalyan Latest Updates,Janasena Chief Pawan Kalyan Live News

శ్రీ శోభకృత్ నామ ఉగాది పండుగ సందర్భంగా తెలుగువారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలని ఆకాంక్షించారు. “ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన పండుగ. వసంతం అడుగుపెడుతూనే ఉగాదిని కుడా మోసుకురావడం విశిష్టదాయకం. ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఉగాది మన తెలుగువారికి తొలి పండుగ అయింది. సంక్రాంతి నాటికి పంట చేతికి వస్తే, ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవే కావడం వల్ల అవి అంత శోభాయమానంగా వెళ్లి విరుస్తాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నిష్క్రమిస్తూ శ్రీ శోభకృత్ ప్రవేశిస్తున్న ఈ శుభ ఘడియలలో తెలుగువారందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన ఉగాది శుభాకాంక్షలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

“రైతులు, కార్మికులు, వ్యాపార వాణిజ్యవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నా సోదర సోదరీమణులందరి జీవితాలు శోభాయమానం కావాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ఆరోగ్యం, ఆనందంతో పాటు సిరిసంపదలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 1 =