ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది ఆనందం మరియు ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం అందరికీ సంతోషాన్ని, ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉగాది పండుగ, తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ అని, ఏపీ ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని నజీర్ ఒక ప్రకటనలో తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం మరియు సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పవిత్రమైన పండుగ రోజున ఉగాది పచ్చడిని తయారు చేసి ఆస్వాదిస్తారని తెలిపిన గవర్నర్ నజీర్, ఇది జీవితంలోని అన్ని అభిరుచులను కలిగి ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా జీవితం విసిరే అన్ని రకాల రుచులకు సిద్ధంగా ఉండాలని ప్రతీకాత్మకంగా గుర్తుచేస్తుందని వివరించారు.
మరోవైపు సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని కోరుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శోభకృతు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE