భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. జూన్ 29, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,48,318 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 కరోనా పాజిటివ్ కేసులు, 380 కరోనా మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 16,475 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 3,21,722 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 2,10,120 మంది కరోనాకు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 4వ స్థానంలో, కరోనా మరణాల్లో 8వ స్థానంలో నిలిచింది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 29th June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 548,318
▶️ Active cases: 210,120
▶️ Cured/Discharged/Migrated: 321,723
▶️ Deaths: 16,475#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/jjalosD9hZ
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu