దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయడంతోపాటు ఈ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించాలని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. రాబోయే 25 ఏళ్లకు బీజేపీ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ పాలనలో ప్రభత్వాలపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు పాటు పడతాయని నిజంగా నమ్ముతున్నారని అన్నారు. ఈ నెలలో కేంద్రంలో బిజెపి ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకోనుందని గుర్తు చేశారు.
ఈ ఎనిమిదేళ్లు ఎన్నో గొప్ప సంకల్పాలు వాటికి సంబంధించిన విజయాలు సాకారమయ్యాయని పేర్కొన్నారు. ఈ కాలంలో సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమానికి మన ప్రభుత్వం అంకితమైందని మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి ఫలితాలను చూడటంతోపాటు పనిని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల బాధ్యత మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల బాధ్యత మరింత పెరుగుతోంది. కానీ దీనిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు విషప్రచారం చేస్తాయని, వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి అన్ని రాష్ట్రాలపై సవివర నివేదిక తీసుకుని పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ