జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ నుంచి మిథాలీ రాజ్ మరియు రవి చంద్రన్ అశ్విన్ ను ఖేల్ రత్న అవార్డు కోసం బీసీసీఐ సిఫారసు చేసింది. అర్జున అవార్డు కోసం ఆటగాళ్లు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా పేర్లను సిఫారసు చేశారు.
ఇక ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపిని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఎఐసిఎఫ్) సిఫారసు చేసింది. విధిత్ గుజరాతి, ఎంఆర్ లలిత్ బాబు, అధిబాన్ బాస్కరన్, ఎస్పీ సేతురామన్, పద్మిని రౌత్ , భక్తి కులకర్ణిలను అర్జున అవార్డులకు ఎఐసిఎఫ్ నామినేట్ చేసింది. అభిజిత్ కుందేను ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు నామినేట్ చేశారు.
బాడ్మింటన్ కు సంబంధించి కీలక ఆటగాళ్లు భమిడిపాటి సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ పేర్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఖేల్రత్న అవార్డుకు సిఫారసు చేసింది. అలాగే ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్వర్మల పేర్లను అర్జున అవార్డుల కోసం బాయ్ ప్రతిపాదించింది. కోచ్లు భాస్కర్బాబు, మురళీధరన్ లను దోణాచార్య అవార్డుకు, పీవీవీ లక్ష్మి, లెరోయ్ డిసాలను ధ్యాన్చంద్ అవార్డులకు బాయ్ సిఫారసు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ