భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపి క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 12వేలకు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కరోనా కేసులు సోమవారం నుంచి కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపించాయి. అయితే మళ్ళీ రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇక కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో (బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) మొత్తం 2,30,419 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 12,591 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65వేల మార్కును దాటింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,48,57,992కి చేరినట్లయింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,230కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 20, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,30,419
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 19–ఏప్రిల్ 20 (8AM-8AM)] : 12,591
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,48,57,992
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 10,827
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,61,476
- కరోనా రికవరీ రేటు : 98.67 శాతం
- యాక్టివ్ కేసులు : 65,286
- కొత్తగా నమోదైన మరణాలు : 29
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,230
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (2,20,66,28,332) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE