రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఆయనను పరీక్షించిన వైద్యుల బృందం హోం ఐసోలేషన్ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు రక్షణ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల బృందం అతడిని పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు’ అని పేర్కొంది. ఇక రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్కు హాజరు కావాల్సి ఉంది. అయితే వైరస్ పరీక్షలో పాజిటివ్గా తేలడంతో ఆయన ఈ ఈవెంట్కు దూరం అయినట్లు ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE