భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు వరుసగా 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం మరింతగా కలవరానికి గురిచేసింది. అయితే ఆ తర్వాత వైరస్ ఉధృతి క్రమేణా తగ్గుతూ.. ప్రస్తుతం 3-4 వేల మధ్య కేసులు నమోదవడం కొంత ఊరట కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలో కరోనాకు సంబంధించిన కేసుల వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు) మొత్తం 1,39,814 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,961 కోవిడ్-19 పాజిటివ్లు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,67,250కి చేరింది. అలాగే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 30వేలకు పడిపోయింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,659కి చేరింది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మే 6, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,39,814
- కొత్తగా నమోదైన కేసులు [మే 5–మే 6 (8AM-8AM)] : 2,961
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,67,250
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 6,135
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,44,05,550
- కరోనా రికవరీ రేటు : 98.75 శాతం
- యాక్టివ్ కేసులు : 30,041
- కొత్తగా నమోదైన మరణాలు : 17
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,659
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (220,66,76,563) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE