భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో 7వేలకు లోపే కొత్త కేసులు నమోదవడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కరోనా కేసులు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన అప్డేట్ ప్రకారం.. గత 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు) మొత్తం 1,89,087 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 6,660 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,380గా ఉంది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,49,05,827కి చేరినట్లయింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,369కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 25, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,89,087
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 24–ఏప్రిల్ 25 (8AM-8AM)] : 6,660
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,05,827
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 9,213
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,43,11,078
- కరోనా రికవరీ రేటు : 98.67 శాతం
- యాక్టివ్ కేసులు : 63,380
- కొత్తగా నమోదైన మరణాలు : 24
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,369
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (2,20,66,44,679) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ