ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సి. రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును మార్చింది. ఈ మేరకు దీనిని సి. రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా విస్తృత ప్రజామోదం పొందిన తరుణంలో రెండింటికీ సముచిత ప్రాతినిథ్యం కనిపించేలా ఈ పేరు మార్పును ప్రకటించింది. ఇక ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంపై ఏపీ మీడియా (ప్రెస్) అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించి చర్యలు తీసుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం గొప్ప విషయమని, ఈ మేరకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అకాడమీ పేరు మార్పులో తోడ్పాటు అందించినందుకు ఏపీ సమాచార మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ విజయకుమార్ రెడ్డికి కూడా ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE