దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. జనవరి 25, సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,15,504 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మొత్తం 694 కేంద్రాల్లో 33,303 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28,614 సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా కర్ణాటకలో(1,91,449), ఒడిశాలో (1,52,371), ఆంధ్రప్రదేశ్ లో (1,47,030), ఉత్తరప్రదేశ్ లో (1,23,761), తెలంగాణలో (1,10,031) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ