తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు మద్ధతుగా పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. సోమవారం నాడు సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను రజనీకాంత్ కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తమిళనాడు సీఎం సహాయనిధికి నటులు సూర్య, కార్తి రూ.కోటి రూపాయలు, అజిత్ రూ.25 లక్షలు, శివకార్తికేయన్ రూ.25 లక్షలు, నటుడు విక్రమ్ రూ.30 లక్షలు, దర్శకులు మురుగదాస్ రూ.25 లక్షలు, శంకర్ రూ.10 లక్షలు, వెట్రి మారన్ రూ.10 లక్షలు, అలాగే రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ రూ.కోటి రూపాయలు విరాళం అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ