కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లబ్దిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల పరంగా అమెరికా, యూకే తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 33 వ రోజైన ఫిబ్రవరి 17, బుధవారం నాడు మొత్తం 7,932 సెషన్స్ లో 4,22,998 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 3,30,208 లబ్దిదారులకు మొదటి డోస్, 92,790 మంది హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు.
ఇక ఫిబ్రవరి 18, ఉదయం 8 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 94 లక్షలు (94,22,228) దాటింది. ఇందులో 61,96,641 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 3,69,167 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 28,56,420 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్) వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికి దాకా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 9,34,962, మహారాష్ట్రలో 7,81,800, రాజస్థాన్ లో 7,60,075, గుజరాత్ లో7,17,244 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 4,11,783, తెలంగాణలో 3,33,235 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ