దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,082 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 5, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,59,447 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 7 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,486 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువగా ఉంది.
దేశంలో 15,200 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.78 శాతం:
దేశంలో ప్రస్తుతం 15,200 (0.04%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,580 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,13,761 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు నవంబర్ 4, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 90.17 (90,17,28,285) కోట్లకు చేరుకుంది. నవంబర్ 4న 1,57,300 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE