దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు, 1501 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,77,150 కి పెరిగింది. రోజువారీగా ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ఇంత పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం కూడా ఇదే తొలిసారి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్ గడ్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 18 లక్షలకు (18,01,316) చేరుకుంది. మరో 1,38,423 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 86.62 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షద్వీప్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 18, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 26,65,38,416
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,47,88,109
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 17–ఏప్రిల్ 18 (8AM-8AM)] : 2,61,500
- నమోదైన మరణాలు : 1501
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,28,09,643
- యాక్టీవ్ కేసులు : 18,01,316
- మొత్తం మరణాల సంఖ్య : 1,77,150
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ