ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఏపీకి మరో 5.76 లక్షల (5,76,000) కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. వైద్య అధికారులు వెంటనే వాటిని రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కేటాయింపు ఆదేశాలకు అనుగుణంగా 13 జిల్లాలకు తరలించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ