దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 500 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 30,254 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 13, ఆదివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 98,57,029 కు చేరుకుంది. కరోనాతో మరో 391 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,43,019 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 93 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకేరోజులో 33,136 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 93,57,464 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.93 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,56,546 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ