దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 36,571 కేసులు, 540 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,58,829 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,33,589 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం, మణిపూర్, మిజోరాం వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 36,555 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,15,61,635 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.54 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (ఆగస్టు 19 (8am)–ఆగస్టు 20 (8am)):
- కేరళ – 21116
- మహారాష్ట్ర – 5225
- తమిళనాడు – 1702
- ఆంధ్రప్రదేశ్ – 1501
- కర్ణాటక – 1432
- ఒడిశా – 1041
- వెస్ట్ బెంగాల్ – 731
- అస్సాం – 713
- మణిపూర్ – 526
- మిజోరాం – 487
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ